Wednesday, May 1, 2024

Hindupur MP – చంద్రబాబుని నేను అలా అనలేదు.. ఎంపి మాధవ్

అనంతపురం, ప్రభ న్యూస్ బ్యూరో – సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో చంద్రబాబు చస్తారు అని తాను చెప్పిన మాటలను వక్రీకరించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చస్తారు అని చెప్పడంలో అర్థం 2024లో ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి వస్తారని, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సమాధి అవుతాయని చెప్పడం దాని అర్థమని గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన సందర్భంలో తన ఉచ్చరణలో కొంత లోపం వుందే కానీ నా భావం ఆయన చస్తాడని కాదని అన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబుకు జైల్లో శత్రు దుర్భేద్యమైన రక్షణ కల్పించిందని గోరంట్ల మాధవ్ అన్నారు. చంద్రబాబు ప్రాణాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాణాలు వడ్డుతుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement