Sunday, May 5, 2024

పాఠశాలలో హిజాబ్ వివాదం..

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వికాస్ పబ్లిక్ స్కూలులో హిజాబ్ వివాదం తలెత్తింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థినులను హిజాబ్ తీసివేసి పాఠశాలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో పెద్ద ఎత్తున ముస్లింలు పాఠశాల వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ, ఎంఈవో ఆంజనేయులు పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పించారు. మరోమారు ఇటువంటి సున్నితమైన అంశాలు లేవనెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎంఈవో హామీ ఇవ్వటంతో ముస్లింలు, మతపెద్దలు తమ ఆందోళనను విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement