Monday, May 6, 2024

హయ్యెస్ట్​ సాలరీ 11.5ల‌క్ష‌లు.. జాబ్​మేళాలో 373 మందికి నియామక పత్రాలు: విజ‌య‌సాయిరెడ్డి

ఏఎన్యూ క్యాంపస్, (ప్రభ న్యూస్): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తొలిరోజు 7,473 మందికి ఉద్యోగ అవ‌కాశాలు కల్పించామని చెప్పారు. ఉద్యోగం వచ్చిన వారిలో అత్యధిక వార్షిక వేతనం రూ. 11.5 లక్షలు అని, ఆ తర్వాత 5. 47 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందన్నారు. తొలిరోజు 373 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన‌ట్టు తెలిపారు. షార్ట్ లిస్టు లో ఉన్న మ‌రో 1562 మందికి రెండో రౌండు ఇంటర్వ్యూలు ఉంటాయ‌ని వెల్ల‌డించారు విజ‌య‌సాయిరెడ్డి. ఆదివారం మరి కొందరికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుందని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement