Friday, May 3, 2024

High Range: సెంచరీ కొట్టిన టమోటా.. బిత్త‌ర‌పోతున్న జ‌నాలు..

మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో ఈరోజు (బుధ‌వారం) మొదటి రకం టమోటా ధర కిలో రూ.100 పలికింది. గడచిన ఐదేళ్లలో ఇంత అత్యధిక ధర నమోదవడం ఇదే ఫ‌స్ట్ టైమ్ అని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులు, వరుసగా కురుస్తున్న వర్షాలతో టమోటా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. అంతో ఇంతో వస్తున్న పంట కాస్త‌ వర్షం కారణంగా నాణ్యత లేకపోవడం, డ్యామేజీ అధికంగా వస్తుండటంతో మార్కెట్‌లో టమోటాకు డిమాండ్‌ ఏర్పడింది.

దీనికితోడు బయట రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడ స్థానికంగా లభ్యమయ్యే పంటకు నష్టం వాటిల్లింది. దీంతో వ్యాపారులు 365 రోజులు టమోటా దొరికే మదనపల్లె మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్‌లో అన్‌సీజన్‌ కావడం, దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, డిమాండ్‌ ఎక్కువ ఉండటంతో ఒక్క‌సారిగా రేట్లు పెంచేశారు. దీంతో రికార్డు స్థాయిలో ధర పలికిన‌ట్టు తెలుస్తోంది. కాగా, 2016 నవంబర్‌లో మొదటి రకం ట‌మోటాకు అత్యధికంగా కిలో రూ.98 పలికింది. ఆ తర్వాత కిలో రూ.100 ఇప్పుడు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement