Saturday, April 27, 2024

AP | ఇకపై శనివారం కూడా పాస్‌ పోర్ట్‌ సేవలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ లోని పాస్‌ పోర్ట్‌ సేవా కేంద్రాలు ఇకపై శనివారం కూడా సేవలందించనున్నట్లు- అధికారులు వెల్లడించారు.దరఖాస్తుదారుల వేచిచూసే సమయాన్ని తగ్గించేందుకు, మెరుగైన సేవలందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతి సేవా కేంద్రాలు శనివారం సైతం పాస్‌ పోర్టు కేంద్రాలు పని చేస్తాయని, ప్రతి శనివారం 2,200 స్లాట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement