Wednesday, May 1, 2024

అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ 22కు వాయిదా

మే 19న రాత్రి కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య జరిగిన సంగతి తెలిసిందే. కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఏపీలో సంచలనం రేపిన విషయం విధితమే. ఈకేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి నిరాశ తప్పలేదు. తనకు బెయిల్ ఇవ్వాలని ఇదివరకు రెండుసార్లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కోర్టుకు పిటిషన్‌ పెట్టుకోగా కోర్టు తిరస్కరించింది. మూడో పిటిషన్‌ దాఖలు చేయగా ఈరోజు విచారించిన కోర్టు ఈనెల 22న తిరిగి విచారణ చేపడుతామని వాయిదా వేసింది. అనంతబాబు మే 23 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement