Sunday, April 28, 2024

భార్యపై అనుమానంతో ఆ ప‌నిచేశాడు.. మూడు రోజులుగా ఇంట్లోనే..

గిద్దలూరు, (ప్రభ న్యూస్‌) : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త గుట్టుచప్పుడు కాకుండా ఆమెను చేంపేశాడు. ప్ర‌కాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచెర్ల రోడ్డులోగల ఎల్‌ ఐ సి కార్యాలయం సమీపంలో ఈ ఘ‌ట‌న జరిగింది. కర్నూల్‌ జిల్లా సిరివెళ్ల కు చెందిన పార్శాపు శ్రీధర్‌ తన భార్య పోలవరపు తిరుపతమ్మ అలియాస్‌ జ్యోతి (28)తో కలిసి గిద్దలూరు పట్టణంలోని ఎల్‌ ఐసి కార్యాలయం వెనుక వీధిలో మూడు నెలల కిందట అద్దెకు ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నాడు.

వారు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కాని శ్రీధర్‌ కంభంలో లారీ క్లినర్‌ గా పనిచేస్తూన్నాడు. కొద్ది రోజులుగా అనుమానం తో భార్య భర్తల మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ ఆదివారం రాత్రి మద్యం సేవించి వచ్చిన భర్త శ్రీధర్‌ భార్య జ్యోతితో గొడవపడి హత్య చేశాడు. భార్య మృతి చెందగా మృతదేహంతోనే రెండు రోజులు ఇంట్లోనే గడిపాడు.

మంగళవారం మధ్యాహ్నం నిందితుడు విఆర్వో ద్వారా గిద్దలూరు పోలీస్‌ స్టేషన్‌ లో లొంగిపోయి తన భార్యను హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే గిద్దలూరు సిఐ ఎండి ఫిరోజ్‌, ఎస్సై బ్రహ్మనాయుడు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి మెడ భాగంలో గాయాలున్నట్లు- తెలిసింది. మృతురాలిది గుంటూరు జిల్లా కాగా నిందితునిది కర్నూలు జిల్లా అని తెలిసింది. వీరిది కులాంతర వివాహం కాగా వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసింది. గిద్దలూరు సిఐ ఎండి ఫిరోజ్‌ దర్యాపు చేస్తున్నట్లు- తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement