Sunday, May 19, 2024

నా భర్తను అప్పగించండి.. పోలీసు స్టేషన్‌ ఎదుట యువతి నిరసన

మదనపల్లి (చిత్తూరు) ప్రభ న్యూస్‌ : తన భర్తను అప్పగించాలంటూ సనా అనే యువతి మదనపల్లి తాలూకా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లాకు చెందిన సనా.. చిత్తూరు జిల్లా పోతబోలు పంచాయతీ దిగువగాండ్లపల్లికి చెందిన రమేశ్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు వారి కాపురం సజావుగా సాగింది. ఈ క్రమంలో అత్త మామలు తన భర్తకు వేరే పెళ్లి చేయాల‌నే ఉద్దేశంతో దాచిపెట్టారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో న్యాయం చేయాలంటూ సోమవారం మదనపల్లి తాలూకా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన చేపట్టింది.

తనను, తన భర్తను విడదీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. దానిపై పోరాటం చేస్తుంటే పోలీసులు విడాకులు తీసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నానని, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని మీడియా ముందు కన్నీరు మున్నీరైంది. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement