Thursday, April 25, 2024

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా ఆక్రమణల తొలగింపు

టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆక్రమణలను రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. యాదవ జగ్గరాజుపేట చెరువుకు చెందిన 2 అడుగుల స్థలం ఆక్రమించారంటూ పల్లా శ్రీనివాసరావుకు చెందిన స్థలంలో ఫెన్సింగ్ ను తొలగించారు. భారీ పోలీసుల బలగాల మధ్య ఆక్రమణలను రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. 

అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలం ఉంటే తీసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. టీడీపీ నేతలపై పెట్టే దృష్టి.. అభివృద్ధి మీద పెడితే ప్రజలకి ఉపయోగం అని పేర్కొన్నారు.

కాగా, పల్లా శ్రీనివాస్ కు సంబంధించిన ఆక్రమణల విషయంపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. గత ఏప్రిల్ లో పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని జీవీఎంసీ కూల్చివేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement