Saturday, April 20, 2024

దేశంలో తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే..

భార‌త్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 80,834   క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వైరస్​ బారినపడి మరో 3,303 మంది మరణించారు. అదే సమయంలో 1,32,062 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,39,989కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 3,70,384 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇప్పటివరకు  2,80,43,446  మంది కోలుకున్నారు. కాగా, ప్రస్తుతం 10,26,159  మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,31,95,048 మందికి వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement