Tuesday, May 7, 2024

ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ దే.. సీఎం జగన్

ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ దేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరులో మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… మైనార్టీల సంక్షేమంలో వైఎస్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా తాను రెండు అడుగులు ముందుకు వేస్తున్నానన్నారు. గతంలో మైనార్టీలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చామన్నారు. ఇప్పుడు జరుగుతున్న మార్పును గమనించాలన్నారు. మైనార్టీ పిల్లలు బాగా చదవాలన్నారు. చదువు లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గలేరన్నారు. గత ప్రభుత్వం మైనార్టీలకు రూ.2665కోట్లు ఇస్తే.. ఈ మూడున్నరేళ్లలో రూ.20వేల కోట్లు సాయం చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement