Thursday, May 2, 2024

త‌ల్లి గొంతుకోసిన కొడుకు.. వృద్ధురాలు మృతి..

అమ‌రావ‌తి : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చంటిపాపల్లా కాపాడాల్సిన ఓ తనయుడు ఉన్మాదిలా మారి ఆమె గొంతుకోసి హత్య చేసిన ఘ‌ట‌న చిలకలూరిపేట మండలం రాజాపేటలో చోటు చేసుకుంది. తల్లి ఆదిశేషమ్మ(67)ను కుమారుడు వీరయ్య ఇవాళ తెల్లవారుజామున ఓగేరు వాగు వద్ద బ్లేడుతో గొంతుకోసి అక్కడే వదిలేసి పారిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం హుటాహుటినా గుంటూరులోని జీజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్సపొందుతూ మృతి చెందింది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. తల్లిని చంపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement