Friday, April 26, 2024

భారీగా రేషన్ బియ్యం స్వాధీనం

గుంటూరు జిల్లా అమృతలూరు మండల పరిధిలో రేషన్ మాఫియా పేట్రేగిపోతోంది. పోలీసుల మెతక వైఖరి, అవినీతే ఇందుకు కారణమని తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున అమృతలూరు మండల పరిధిలోని తురుమెళ్ల గ్రామంలో జడ్పీ హైస్కూల్ సమీపంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి అమృతలూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, గత కొద్దికాలంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రేషన్ బియ్యం, బియ్యం తరలిస్తున్న సంబంధిత వాహనాలను అమృతలూరు పోలీసులకు అప్పగించడం గమనార్హం. నెలవారి మామూళ్లకు అలవాటు పడిన పోలీసులు  రేషన్ మాఫియాని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకొని రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement