Monday, April 29, 2024

పేద ప్రజలకు ఇంకా అందని ప్రభుత్వ బియ్యం

మేడికొండూరు ఫిబ్రవరి 17(ప్రభా న్యూస్)మండల పరిధిలోని పాలడుగు గ్రామంలో షాప్ నెంబరు 28 సంబంధించిన ఇదే వాహనము సిరిపురం గ్రామంలోని కొన్ని ప్రాంతాలకు ఇవ్వవలసినఇంటింటికి తిరిగి ఇవ్వవలసిన బియ్యపు వాహనము ఇంతవరకు ఇంటింటికి తిరిగి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్న వలస కూలీలు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఒకటో తారీకు నుంచి మొదలై 15వ తారీకు వరకు ఇచ్చే బియ్యం 17వ తారీకు వచ్చినా ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురై షాపు వద్దకు చేరుకొనగా షాపు యజమాని ఇంకనూ ఇంటింటికి తిరిగి ఇవ్వవలసిన వాహనం డ్రైవరు స్పందించలేదని డీలరు వాపోతున్నాడు చరవాణి కి కూడా స్పందించకపోవడంతో రాలేదని అనడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అయినారు ప్రజల ఇబ్బందులను ఇంతవరకు సంబంధిత అధికారులు ఇంతవరకు పట్టించుకోకుండా పోవడం తో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుప్రభుత్వ అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement