Tuesday, May 21, 2024

సత్తెనపల్లి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈనెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తుండగా .. పార్టీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరగడంతో ఘర్షణ జరిగింది. ఒక వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను, మరో వర్గం వారు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. టీడీపీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29వ తేదీన‌ వాడవాడల్లో పలు కార్యక్రమాలు జరిపేందుకు పార్టీ నిర్ణయించింది. ఈసంద‌ర్భంగా ఈరోజు అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేయ‌డంతో ఘ‌ర్ష‌ణ స‌ద్దుమ‌ణిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement