Thursday, April 25, 2024

మాజీ ఎంపీ సబ్బంహరి మృతి నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది – చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి – టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింద‌న్నారు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. .. ‘సబ్బంహరి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నాను. ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటారని ఆశించాను. కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది. సబ్బంహరి మృతి పార్టీకి తీరని లోటు. ప్రజా సమస్యలపై స్పందించడంలో హరి ఎప్పుడూ ముందుండేవారు. విశాఖ మేయర్ గా, లోక్ సభ సభ్యులుగా సబ్బంహరి ప్రజలకు ఎనలేని సేవ చేశారు. సబ్బంహరి మంచి వక్త. సమకాలీన రాజకీయాలపై సబ్బంహరికి మంచి పట్టుంది. ఏ అంశంమైనా లోతైన విశ్లేషణ చేసేవారు. సబ్బంహరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. హరి కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement