Thursday, May 2, 2024

ఎపి స్కూళ్లలో మాటేసిన మహమ్మారి.. కరోనా హాట్‌స్పాట్లుగా విద్యాసంస్థలు

ఎపిలో విస్తృత వ్యాప్తి
ఒక్కరోజే 492 కేసులు నవెూదు
ఆరు జిల్లాల్లో అత్యధిక ప్రభావం
రాజమండ్రి స్కూల్‌లో 163మంది విద్యార్థులకు పాజిటివ్‌
అప్రమత్తమైన ప్రభుత్వం
మంత్రుల అత్యవసర భేటీ
రేపటి నుంచి అవగాహనా కార్యక్రమాలు
నో మాస్క్‌… నో ఎంట్రీ పేరిట కార్యక్రమాలు
7న క్యాండిల్‌ ర్యాలీ

అమరావతి, : ఎపిలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అనేక విద్యాసంస్థలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారా యి. గడిచిన వారం రోజులుగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా విద్యాసంస్థలలోనే బయ టపడటం ఆందోళన కలిగిస్తోంది. తిరుమల వేద పాఠశాలలో 57 మంది విద్యార్థులు కరోనా బారిన పడిన ఘటన మరువక ముందే తాజాగా రాజ మహేంద్రవరంలోని ఒక ప్రైవేట్‌ విద్యా సంస్థలో 163 మందికి వైరస్‌ సోకడం ఆందోళన కలిగి స్తోంది. ఈ విద్యా సంస్థల్లో 700 మంది విద్యార్థు లకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 163 మందికి కరోనా సోకినట్లుగా
నిర్థారణౖంది. అదే విధంగా శ్రీశైలం వేద పాఠశాలలో కూడా ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లుగా వెల్లడైంది. కాగా గడచిన 24 గంట ల్లో 492మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మూడు నెలలుగా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. కాగా మంగళ వారం ఒక్క సారిగా కేసులు పెరిగిపోవడంతో ఆందోళన నెలకొంది. ప్రధానం చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, అనం తపురం, క ర్నూలు జిల్లాలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసు లుభారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమ త్తమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విజయవాడలో అధికా రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థలతో పాటు రాష్ట్రంలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసు లపై సమీ క్షించారు. కాంటాక్ట్‌, ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అం తేకాకుండా కరోనా నియంత్రణపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కలిగించాలని నిర్ణయించారు.
రేపటి నుంచి విస్తృత ప్రచారం
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు అంటే 15 రోజుల పాటు కరోనా కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అందరి అధికారులను భాగ స్వాములను చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కలి గించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అదే విధం గా ఏప్రిల్‌ 7వ తేదీన అవగాహన కార్యక్రమాల ముగింపు సంద ర్భం గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో విధిగా క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించాలని ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం పాల్గొనాలని స్పష్టం చేశారు.
వ్యాక్సినేషన్‌ మరింత ఉధృతం
మూడు లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి రోజు వ్యాక్సిన్‌ వేయాలనే లక్ష్యాన్ని వైద్య ఆరోగ్య శాఖకు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని సచివా లయాలతో పాటు 1,930 ప్రభుత్వ ఆసుపత్రులు, 634 ఆరోగ్య శ్రీ నెట్‌ వర్క్‌ ఆసుపత్రులలో టీకా ప్రక్రియ నిర్వహించాలని ఆదేశిం చారు. టీకా తీసుకున్న వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిం చాలని అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ నిర్వ హించే ప్రాంతాల్లో మైక్‌లు ద్వారా ప్రచారం చేపట్టాలని దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులు బుగ్గన, ఆళ్ల నాని ఆదేశించారు.
నో మాస్క్‌. నో ఎంట్రీ..
రాష్ట్రంలో కరోనా మరోసారి కోరలు చాస్తున్న తరుణంలో ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, విద్యా సంస్థలు, మత సంస్థలు, సినిమా హాళ్లలో మాస్క్‌ ధరించడాన్ని త ప్పనిసరి చేయాలని ఆదేశించింది. నో మాస్క్‌.. నో ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. అధికార యంత్రాంగం ఎప్ప టికప్పుడు క్షేత్ర స్థాయిలో తనిఖీ లు నిర్వహిస్తూ.. మాస్క్‌లు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500, పట్టణ ప్రాంతాల్లో రూ. వెయ్యి జరిమానా విధించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలకు అనుగుణంగా కోవిడ్‌ ప్రోటోకాల్‌ అమలు కావాలని నిర్దేశించారు. అదే విధంగా భౌతిక దూరం, శానిటైజర్‌ వినియోగంపై విస్తృతమైన అవగాహన కల్పిం చాలని స్పష్టం చేశారు.
విద్యార్థులకు ప్రత్యేక చికిత్స – మంత్రి ఆళ్లనాని
రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ విద్యా సంస్థలో 163 మంది విద్యార్థులకు కరోనా సోకిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడటం జరిగిందని విద్యార్థులకు సరైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కరోనా సోకిన విద్యార్థులను అదే విద్యా సంస్థలోని గదుల్లో ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన విద్యార్థులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లుగా మంత్రి వెల్లడించారు.
ఆరు జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రత
రాష్ట్రంలో కరోనా వైరస్‌ మహమ్మారి మళ్లి విజృంభిస్తుండటం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరగటం వైరస్‌ వ్యాప్తి తీవ్రతను స్పష్టం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం శోచనీయం. మూడు నెలల తర్వాత రికార్డు స్థాయి లో 492 మంది కోవిడ్‌ బారిన పడటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం సోమవారం ఉద యం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 33 వేల 634 కరోనా పరీక్షలు నిర్వహించగా, వాటిలో 492 కొత్త కేసులు వెలుగుచూశాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్య ధికంగా ఒకే రోజు 168 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కృష్ణా జిల్లాలో 63, చిత్తూరులో 56, విశాఖ జిల్లాలో 46 మందికి కరోనా సోకినట్లుగా నిర్థారణ అయ్యింది. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ సోకిన వారి సంఖ్య 8 లక్షల 94 వేల 536 కి చేరింది. వీరిలో 8 లక్షల 84 వేల 727 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్‌ అయి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రెండు కరోనా మర ణాలు నమోదయ్యాయి. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొ క్కరు చొప్పున వైరస్‌ తీవ్రతతో మృతి చెందారు. తాజాగా నమోదైన ఈ మరణాలతో కలిపి ఇప్పటి వరకు కోవిడ్‌కు బలైన వారి సంఖ్య 7,193కి చేరింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 256 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మరో 2,616 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

బ‌డులు మూయ‌బోం – మంత్రి ఆదిమూల‌పు
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామే కాని ప్రసు ్తతానికి పాఠశాలలకు సెలవులు ఇచ్చే ప్రసక్తే లేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తేల్చి చెప్పారు. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా నిర్వహించమని దీనివల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. పాఠశాలలో కరోనా వ్యాప్తి చెంద కుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యార్థులు, తల్లిదండ్రులు భయాం దోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే కోవిడ్‌ నిబంధ నలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపా ధ్యాయులు తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని అదే విధంగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement