Friday, April 19, 2024

శ్రీవారి హుండీలో చోరీ..

తిరుమల శ్రీవారి హుండీలో చోరీ ప్రయత్నం కలకలం రేపింది. చోరీకి పాల్పడిన ముగ్గురు యువకులను తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 30 వేలను స్వాధీనం చేసుకున్నారు. భక్తితో యాత్రికులు తమ మొక్కులను స్వామి దర్శనం తరువాత హుండీలో సమర్పించుకుంటారన్న సంగతి తెలిసిందే. మంగళవారం శ్రీవారి ఆలయానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. ఎక్కువ నగదుతో హుండీ దగ్గరకు వస్తున్న వారిని గమనించారు. నిందితుల్లో ఒకరు హుండీలో కానుకలు వేస్తున్నట్టు నటించి ముందున్న భక్తులు వేసిన నగదును హుండీలో పడకముందే పట్టుకుని మరో నిందితుడికి అందజేశాడు. వారికి అక్కడే ఉన్న మరో వ్యక్తి సాయంగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సీసీటీవీ కెమెరాల ద్వారా విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆలయం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మొత్తం ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement