Thursday, May 2, 2024

గుర్తుతెలియని మృతదేహం లభ్యం..

చిలకలూరిపేట, మార్చి 11 ( ప్రభ న్యూస్) : పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన శనివారం గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిలకలూరిపేట నుండి గుంటూరు వెళ్ళే మార్గంలో నక్క వాగు సమీపంలో సుమారు 35 సంవత్సరాల పురుషుని మృతదేహం గుర్తించారు. అయితే మూడు నాలుగు రోజుల క్రిందటే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా ఎవ‌రైనా హత్య చేశారా అని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement