Monday, May 13, 2024

పోల‌వ‌రం, విశాఖ స్టీల్ కోసం పార్ల‌మెంట్ లో స‌మ‌ర‌మే – ఎంపి మిథున్ రెడ్డి.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు కేటాయించాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాడుతామని వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభ బీఏసీ సమావేశానికి హాజ‌రైన అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేందుకు అధిక సమయం ఇవ్వాలని బిఎసిలో కోరామ‌ని తెలిపారు. దీనికి లోక్‌సభ స్పీకర్‌ సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారని గుర్తు చేస్తూ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలందరం కేంద్ర మంత్రులను కలిశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులన్నీ కేంద్రమే భరించాలన్నారు. సవరించిన అంచనాలను ఆమోదించాలని బీఏసీ సమావేశంలో కోరినట్లు మిథున్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement