Tuesday, May 7, 2024

ఇక‌పై ఇ– హుండీ ద్వారా ఆల‌యాల‌కు భక్తుల కానుక‌లు – జ‌గ‌న్..

అమ‌రావతి: దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలనే ఈ సిస్టమ్‌ తీసుకువచ్చినట్లు సీఎం చెప్పారు. దేవాదాయశాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాలు టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలోకి తెచ్చామన్నారు. దేవాలయాల సమాచారం, ఆన్‌లైన్‌ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్‌బోర్డు, సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా టెంపుల్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవస్థలో ఉంటాయి. క్యూ–ఆర్‌ కోడ్‌ ద్వారా ఇ– హుండీకి భక్తులు కానుకలు సమర్పించే అవకాశం కల్పించారు. తొలిసారి అన్నవరం దేవాలయంలో ఆన్‌లైన్‌ పేమెంట్‌వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన దేవాలయాలల్లో ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ నిర్వహించనున్న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అన్నవరం టెంపుల్‌కు 10,116లు ఇ–హుండీ ద్వారా సమర్పించింది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, ఎండోమెంట్‌ కమిషనర్‌ అర్జున రావు, యునియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండి అండ్‌ సిఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్‌ జి, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్‌ వి.బ్రహ్మనందరెడ్డి, ఎస్‌ఎల్‌బిసి ఏజీఎం అండ్‌ కోఆర్డినేటర్‌ ఇ.రాజుబాబు, రీజనల్‌ హెడ్‌ వి రమేష్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement