Sunday, May 5, 2024

ఆధునిక భారతీయ మహిళ ఎపి నుంచే ఆవిర్భ‌వించాలి – జ‌గ‌న్..

అమ‌రావ‌తి – 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రం నుంచే ఆవిర్భవించాలనే ధృడ సంకల్పంతో.. రేపటి తరం చిన్నారులకు సింహ భాగం అన్ని పథకాల్లో వారికిచ్చామని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జ‌రిగిన‌ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ ను క‌త్తిరించారు.. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, మహిళ అంటే ఆకాశంలో సగభాగమని అంటూ వారికి ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని అభిల‌షించారు.. దీని కోసం త‌మ ప్ర‌భుత్వ ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న‌ద‌ని గుర్తు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement