Sunday, April 28, 2024

AP : ఏపీలో నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు

రాష్ట్రంలో ఇవాళ నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్)కు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు.

- Advertisement -

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement