Tuesday, April 30, 2024

Crime: డ‌బ్బు కోసం.. నాన్నమ్మను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన మనవడు..

డ‌బ్బుల కోసం ఓ మ‌న‌వ‌డు త‌న నాన‌మ్మ‌ను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో జరిగింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గొనెగండ్ల మండలం పెద్దమరివీడులో వెంకటేష్‌ అనే వ్యక్తి.. నాగమ్మ అనే తన నాన్నమ్మను గొంతు నులిమి చంపాడు.. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా.. ఆ ఇంట్లోనే పాతిపెట్టాడు మనవడు వెంకటేష్.. నాగమ్మ దగ్గర ఉన్న డబ్బుల కోసమే వెంకటేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది..

ఇక, నాగమ్మను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన వెంకటేష్.. తనకు ఏమీ తెలియనట్టుగా.. ఇంటినుంచి పారిపోయాడు.. ఎంతకీ నాగమ్మ ఆచూకీ లభించకపోవడంతో.. బంధువులు వెంకటేష్‌ని నిలదీశారు.. చివరకు తానే హత్య చేసినట్టు వెంకటేష్ ఒప్పుకున్నాడు.. దీంతో.. కిడ్నాప్, మిస్సింగ్‌ కేసును కాస్తా హత్య కేసుగా మార్చారు పోలీసులు.. ఈ రోజు నాగమ్మ మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement