Sunday, May 5, 2024

AP: పుట్టపర్తి చేరుకున్న గవర్నర్ నజీర్ అహ్మద్

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 22 (ప్రభ న్యూస్) : రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ పుట్టపర్తి పర్యటన సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం సాయి శ్రీనివాస్ అతిథి గృహంనకు చేరుకున్నారు. బుధవారం శ్రీ సత్య సాయిబాబా వారి విశ్వవిద్యాలయం 42వ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ మాధవరెడ్డి, కడప ఎస్పీ, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి, తిప్పేస్వామి, తదితరులు వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement