Friday, May 17, 2024

గవర్నర్ తేనీటి విందు… హాజరైన జగన్, చంద్రబాబు

ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ ఇచ్చిన తేనీటి విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడులు హాజరయ్యారు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకే వేదికపైకి రావడంతో ఆసక్తి నెలకొంది. చాలా రోజుల తర్వాత ఒకే కార్యక్రమంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు వెంట కేశినేని నాని, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement