Monday, April 29, 2024

సర్కారువారి పాట సినిమాకు వెసులుబాటు.. ఒక్కో టిక్కెట్టుపై రూ.45 పెంపునకు ఉత్తర్వులు

అమరావతి, ఆంధ్రప్రభ: టాలీవుడ్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా టిక్కెట్‌ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఒక్కొక్క టికెట్‌పై రూ.45 చొప్పున పది రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12న సర్కారు వారి పాట విడుదల కానున్నది. గతంలో ప్రభుత్వ ఉత్తర్వలు మేరకు రూ.100 కోట్ల బడ్జెట్‌ దాటిని సినిమాలకు టిక్కెట్‌పై అదనపు రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

సినిమా విడుదల సమయంలో సంబంధిత నిర్వహకుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం పరిశీలించి అదనపు రేట్ల వసూలుకు అనుమతిస్తుంది. ఇటీవల పలు హై బడ్జెట్‌ సినిమాలకు 10 రోజుల పాటు టిక్కెట్‌ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమాకు అన్ని తరగతులకు ఒక్కొక్క టిక్కెట్టుపై రూ.45 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement