Wednesday, May 1, 2024

ప‌టాకుల‌ ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌ సహరాన్‌పూర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. సర్సావా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్‌పూర్ లోని ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలోని ఓ ప‌టాకుల‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దాంతోపాటే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. పలువురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప‌టాకుల‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతుల వివ‌రాల‌ను అధికారులు ధ్రువీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement