Sunday, May 5, 2024

Murder: కదిరిలో బరితెగించిన దొంగలు

అనంతపురం జిల్లా కదిరిలో దొంగల బీభత్సం సృష్టించారు.  ఓ ఇంట్లోకి ప్రవేశించి ఉపాధ్యాయురాలును హత్య చేశారు. మృతురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉష (45) గా గుర్తించారు. భర్త శంకర్ రెడ్డి మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో చోరీకి వచ్చిన దొంగలు… ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పక్కింటి మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఉపాధ్యాయులుగా శంకర్ రెడ్డి ఆయన సతీమణి ఉషారాణిలు ఓడి చెరువు మండలంలో సుదీర్ఘ కాలంగా పనిచేశారు. ఆతర్వాత ఆమడగూరు,కదిరి, ఎన్ పి కుంట మండలాల్లో పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement