Thursday, May 2, 2024

Derailed – అనకాపల్లి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు – పలు రైళ్లు రద్దు

అనకాపల్లి – నేటి తెల్లవారుజామున 3.35 గంటలకు తాడి-అనకాపల్లి మార్గంలో బొగ్గు లోడ్‌తో వస్తోన్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.. ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు పాసింజర్ రైళ్లను, ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసింది .

దీంతో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, రత్నాచల్, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను ఇవాళ రద్దు చేయగా.. గుంటూరు నుంచి విశాఖపట్నానికి వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ జూన్ 15న కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా నడుస్తోందని పేర్కొంది. ఇప్పటికే రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్దరణ పనులను శరవేగంగా చేపడుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement