Tuesday, May 7, 2024

గుడ్‌న్యూస్‌.. తిరుమ‌ల‌లో ఇక ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు

శ్రీ‌వారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్.. చాలా కాలం త‌ర్వాత స‌ర్వ‌ద‌ర్శ‌నం విష‌యంలో స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. కరోనా సంక్షోభం ప్రారంభం అయ్యాక శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఆన్ లైన్లో మంజూరు చేసిన టీటీడీ.. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణుగుతుండడంతో మళ్లీ ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.

రేప‌టి (ఫిబ్రవరి 15) నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రం, శ్రీనివాసం కాంప్లెక్స్ లలో భక్తుల కోసం సర్వదర్శనం టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న‌ట్టు తిరుమ‌ల అధికారులు ప్ర‌క‌టించారు. రేపు ఉదయం 9 గంటల నుంచి నిర్దేశించిన కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement