Saturday, May 4, 2024

ఏపీలో ఎక్క‌డైనా తిరుగుతా.. ఎవ‌రు ఆపుతారో చూస్తా.. రేణుకా చౌద‌రి

గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ఏపీ ప్ర‌జ‌లు న‌ర‌కం అనుభ‌విస్తున్నార‌ని మండిప‌డ్డారు తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌద‌రి.వైసీపీ నేతల తీరును ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఏపీలో తాను ఎక్కడైనా తిరుగుతానని… తనను ఎవరు ఆపుతారో చూస్తానని స‌వాల్ చేశారు. ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. ఏమైనా మాట్లాడితే కులాల పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నేడు ఆమె విజయవాడ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. ఏపీకి రావాలని తనను ఇక్కడి ప్రజలు ఆహ్వానిస్తున్నారని… కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఏపీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement