Monday, April 29, 2024

AP : వైభవంగా ఆది దంపతుల గిరి ప్రదక్షణ

(ఎన్టీఆర్ బ్యూరో,ప్రభ న్యూస్): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణను నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కొరకు, ధర్మప్రచారం నిమిత్తం వేదపండితుల మంత్రోశ్చ‌రణలు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం (ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి, అమ్మవార్లుకు ఆలయ వైదిక సిబ్బందిచే ఉద‌యం సమయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వ‌హించి, ఆలయ ఈవో కెఎస్ రామరావు కొబ్బరి కాయ కొట్టి గిరిప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ కేవిఎస్ కోటేశ్వర రావు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

- Advertisement -

ఆధ్యాత్మిక చింతనతో గిరి ప్రదక్షిణ..
ఇంద్రకీలాద్రి చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షిణ పూర్తి ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంది. గిరిప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయము, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమముల నడుమ తిరిగి ఆలయమునకు చేరుకున్నారు. గిరిప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement