Monday, April 29, 2024

Flash: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అలక

ఏపీ మంత్రివర్గంలో స్థానం లభించకపోవటంతో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అలకపాన్పు ఎక్కారు. ఎవరితో మాట్లాడకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసి మార్కాపురంలోని నివాసంలో ఉండిపోయారు. వచ్చిన నాయకులు, కార్యకర్తలను కలిసేందుకు ఇష్టపడటం లేదని అన్నా రాంబాబు అనుచరులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు నిరసన కొనసాగిస్తున్నారు. అన్నా రాంబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కంభంలో ఆయన అనుచరుల రాస్తారోకో నిర్వహించారు. ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement