Sunday, April 28, 2024

AP: అవ‌స‌రం తీరిన త‌ర్వాత తండ్రి ఫోటోనే తీసేసిన ఘ‌నుడు జ‌గ‌న్ – ఎమ్మెల్యే ఆర్కే….

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ ఫోటోను వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎలా వాడుకున్నారో అలానే అవసరం తీరిన తరువాత ఆ ఫోటోను ప్రస్తుతం ఎక్కడ ఉంచారో ప్రతిదీ ప్రజలకు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసిపి రెబ‌ల్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి. మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనకు నేడు ఉన్నజగన్ పైశాచిక పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారని పేర్కొన్నారు.

విజ‌య‌వాడ‌లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, తాను అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. ఇక ప్రచారం మాత్రమే చేస్తారా లేక పోటీ చేస్తారా అనే ప్రశ్నలకు వైఎస్ షర్మిల ధీటైన సమాధానం ఇస్తారని వెల్ల‌డించారు. . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల్లో వైఎస్ షర్మిలమ్మా పర్యటించనున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని ఏఐసీసీ షర్మిలకు ఇవ్వనుందని పేర్కొన్నారు. ఇక వైసీపీ, టీడీపీ వైకిరితో అసంతృప్తికి లోనైన వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇది కాంగ్రెస్ కు శుభ‌ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు.. వైఎస్ షర్మిల నాయకత్వంలో ఎపిలో కాంగ్రెస్ పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌నే నమ్మకం తనకు ఉందని ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement