Monday, April 29, 2024

గ్యాస్ లీకై కారు దగ్ధం – విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్

ఇబ్రహీంపట్నం ప్రభ న్యూస్ – విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై కిలేశపురం – మూలపాడు మధ్యలో మంగళవారం ఓ కారు ధగ్ధమైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గ్యాస్ లీకై మంటలు చెలరేగినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నవారు కారు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మంటల ధాటికి కారులో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో జనాలు పరుగులు తీశారు. ఈ సంఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

  • .
Advertisement

తాజా వార్తలు

Advertisement