Thursday, April 25, 2024

Breaking: ఏపీలో మరో దారుణం.. రైల్వేస్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. నిత్యం ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని రేపల్లెలో మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌లో ఓ మహిళాపై ఈ ఘటనకు పాల్పడ్డారు. స్టేషన్ లోని 1వ నెంబర్ ప్లాట్ ఫాంపై దంపతులు ఉన్నారు. ఈ క్రమంలో భర్తపై దాడి చేసిన మహిళను ఫ్లాట్ ఫాం చివరకు ముగ్గురు వ్యక్తులు లాక్కెళ్లారు. ఆ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్లాట్ ఫామ్  పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితురాలు ప్రకాశం జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. రైలు కోసం వేచి చూస్తుండగా అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. కాగా, బాధితురాలిని ఎస్పీ జిందాల్ పరామర్శించారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement