Wednesday, May 1, 2024

Funds Release – జగనన్న విద్యా దీవెన – నేడు భీమవరంలో జగన్ పర్యటన

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన పధకానికి సంబంధించి బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

జగనన్న విద్యా దీవెన పథకంలో ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి 2023- 24 విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన అర్హులైన 8 లక్షల 9 వేల 39 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలు నేడు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. దీనికోసం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement