Wednesday, May 1, 2024

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ.. మాడ‌వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చిన స్వామివారు

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శన మిచ్చారు. చిరుజల్లులు కురుస్తుండడంతో ఘటాటోపంతో వాహన సేవ జరిగింది.

గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియచెబుతారు. అంతే కాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియ చెబుతున్నాడు. ఈ కార్యక్రమంలో టిటిడి పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు, వీజివో బాలిరెడ్డి, పేష్కార్‌ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement