Friday, May 3, 2024

నాలుగ‌వ ఏడాది రైతు భ‌రోసా సాయం-రైతు చ‌రిత్ర‌ను మార్చే గొప్ప ప‌థ‌కాలు- సీఎం జ‌గ‌న్

ఏలూరు జిల్లా గ‌ణ‌ప‌వ‌రంలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..4వ ఏడాది రైతుల‌కు భ‌రోసా సాయాన్ని అందిస్తున్న ప్ర‌భుత్వం..తొలి విడ‌త కింద ఒక్కో రైతుకి రూ.5,500సాయం అందించ‌నున్నారు. 50.10ల‌క్ష‌ల మందికి రైతు భ‌రోసా సాయం ఇవ్వ‌నుంది ప్ర‌భుత్వం.వ్య‌వ‌సాయ ప‌నులు ప్రారంభం కాక‌ముందే ఖ‌రీఫ్ పంట పెట్టుబ‌డికి సాయం అందిస్తున్నామ‌న్నారు సీఎం జ‌గ‌న్. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంద‌ని న‌మ్మే ప్ర‌భుత్వం ఇద‌ని తెలిపారు. గ‌తంలో లేని విధంగా ప‌థ‌కాల‌కు ప‌లు ఆలోచ‌న చేశామ‌న్నారు. రైతు చ‌రిత్ర‌ను మార్చే గొప్ప ప‌థ‌కాల‌కు శ్రీకారం చుట్టామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement