Saturday, May 4, 2024

Breaking: ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థుల మృతి.. ప్రకాశం జిల్లాలో ఘటన

ప్రకాశం: ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో ఈత‌కు వెళ్లి నీట‌మునిగి న‌లుగురు విద్యార్థులు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న పుల్లల చెరువు మండలంలో ఇవ్వాల జ‌రిగింది. దీంతో కవలకుంట్ల, కొత్తూరు గ్రామాల్లో విషాదం చోటు చేసుకుంది.

కవలకుంట్ల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులను బ్రమ్మారెడ్డి (14), దస్తగిరి (14), విష్ణు కుమార్ రెడ్డి (14), నారు సాయి కుమార్ రెడ్డి(14)గా గుర్తించారు. పిల్లల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కన్నవారి రోదనలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement