Tuesday, April 23, 2024

దుష్ట పథకం అగ్నిపథ్​ని రద్దు చేయాలి.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి: మావోయిస్టు నేత జ‌గ‌న్‌

అగ్నిపథ్​ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ఉద్యమంపై పోలీసుల కాల్పులను ఖండించారు మావోయిస్టు పార్టీ నేత జగన్​. ఈమేరకు ఆయన ఇవ్వాల (సోమవారం) మీడియాకు లేఖ విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతోనే ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారని, వారి భవిష్యత్​ ఆగమైతుందన్న ఆలోచనతోనే ఆగ్రహానికి గురయ్యారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్​ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో విధ్వంసం జరిగిందని, కావాలనే వాళ్లు అట్లా చేయలేదన్నారు మావోయిస్టు నేత జగన్​. ఇక.. ఆందోళనాకారులపై కాల్పులు జరిపిన పోలీసులపై హత్యా నేరం కింది కేసులు నమోదు చేయాలన్నారు. అగ్నిపథ్​ పథకాన్ని బేషరతుగా రద్దు చేసి, యధావిధిగా ఆర్మీ రిక్రూట్​మెంట్​ చేపట్టాలని సూచించారు.

- Advertisement -

పోలీసు కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి జాబ్​ ఇవ్వాలని, గాయపడ్డ వారందరికీ ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అంతేకాకుండా వెంటనే దేశంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement