Saturday, May 4, 2024

రెండు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

రెండు ప్ర‌మాదాలు జ‌రిగిన ఘ‌ట‌న న‌లుగురికి గాయాలైన ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలయ్యాయి. దూపాడు సమీపంలో సాగర్ కాలువ వద్ద బైకు, కారు ఢీకొన్న ప్రమాదంలో రాజుపాలెంకి చెందిన వీరారెడ్డి, చెన్నకేశవులు గాయాలపాలయ్యారు. రాజుపాలెం వద్ద ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటోలోని ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం వినుకొండ, నరసరావుపేట వైద్యశాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement