Friday, May 3, 2024

Breaking: నీట మునిగి న‌లుగురు మృతి.. ఏపీ, తెలంగాణ‌లో ఘ‌ట‌న‌లు!

నెల్లూరు జిల్లాలో విషాదం నెల‌కొంది. సంగంలోని పెన్నానది వద్ద ఈతకు వెళ్లిన ఆరుగురు యువ‌కుల్లో ముగ్గురు నీట మునిగి గ‌ల్లంత‌య్యారు. వీరిలో మ‌రో ముగ్గురు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈత రాక చ‌నిపోయిన వారిలో సంగం మండలం పెరమన పంచాయతీ జంగాలదరువు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో డి.భ‌వానీ, శ్యామ్‌, చ‌ర‌ణ్ ఉన్నారు..

తెలంగాణ‌లో ఏపీ వ్య‌క్తి మృతి..
తెలంగాణ‌లో ఏపీకి చెందిన వ్య‌క్తి చ‌నిపోయిన ఘ‌ట‌న జ‌రిగింది. గోదావ‌రిలో నీట మునిగి చ‌నిపోయిన‌ట్టు స‌మాచారం. మృతుడిని ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పొన్నూలురు గ్రామానికి చెందిన మణికంఠ (14)గా గుర్తించారు. బాస‌ర‌ అమ్మవారి దర్శనానికి వచ్చి గోదావరిలో మునిగి చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement