Monday, April 29, 2024

Flash.. Flash: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. మావోయిస్టు మృతి..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. సటేగుమల్నార్‌, వెంగ‌నూర్‌ అటవీ ప్రాంతంలో డీఆర్ జీ భద్రతా బలగాలు.. మావోయిస్టులు సంచరిస్తున్నరనే సమాచారం తో కూంబింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇంద్రావతి ఏరియా కమిటీ మావోయిస్టు సబ్యులకు, పోలీసులకు ఎదురుకాల్పులు జ‌రిగాయి.

పోలీసులు కాల్పుల్లో డీవిసియం, మల్లేష్ చ‌నిపోయారు. ఘటనా స్థలంలో మావోయిస్ట్ మృతదేహం, 7.62 ఎం ఎం పిస్టల్, 5కిలోల ఐఇడి బాంబ్, వైర్లు, రోజువారీ మావోయిస్టులు వాడే నిత్యావసర సామ‌గ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్ట్ మల్లేష్ పై 5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement