Tuesday, April 30, 2024

మేద‌ర‌మెట్ల వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం – ముగ్గురు మ‌హిళ‌ల‌తో స‌హా అయిదుగురు దుర్మ‌ర‌ణం

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మ‌హిళ‌ల‌తో స‌హా అయిదుగురు దుర్మ‌ర‌ణం చెందారు.. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు టైరు కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ సమీపంలో పంక్చరైంది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి అటువైపు పడింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు అద్దంకి ఎస్సై సమందర్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మృతుల్లో ఎస్సై సమందర్ భార్య, కుమార్తె, మరదలు తోపాటు మరో మహిళ, ప్రైవేటు డ్రైవర్ ఉన్నారు. చిన్నగంజాం తిరుణాళ్ళకి వెళ్లి అద్దంకి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement