Wednesday, May 1, 2024

అమెరికాలో తెలుగు యువ‌కుడిపై కాల్పులు.. వీర సాయిష్ మృతి

ఎన్నో క‌ల‌ల‌తో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువ‌కుడు మృతి చెందాడు. ఊహించని కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వీర సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. ఒహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు.వీర సాయిష్ పార్ట్ టైం గ్యాస్ స్టేషన్‌లో జాబ్ చేస్తున్నాడు. దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా సాయిష్‌పై దుండగులు కాల్పులు జరిపారు.. అతడికి తీవ్ర గాయాలవ్వగా ఓహియోహెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు.. గురువారం రాత్రి 8 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సాయిష్ తల్లిదండ్రులు ప్రస్తుతం ఏలూరులో నివాసం ఉంటున్నారు. సాయిష్ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సాయి కుటుంబం ఏలూరులో స్థిరపడ్డారు. సి ఆర్ ఆర్ కళాశాల దివంగత ఎల్ వి ఆర్ మాస్టారు చిన్న కుమారుడు సాయిష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement