Monday, April 29, 2024

ఆర్థిక లావాదేవీల ఘర్షణలు : ఇద్దరికి కత్తిపోట్లు

గుంటూరు జిల్లా కారంపూడి పట్టణ శివారులోని సినిమాహల్ సెంటర్ లో నివాసముంటున్న‌ రిటైర్డ్ విద్యుత్ అధికారి ఆలూరు లక్ష్మణరావు పై అతని దూరపు బంధువు అయిన బొల్లాపల్లి మండలంలోని పేర్లపాడు గ్రామానికి చెందిన కోట్ల నాగేశ్వరరావు. ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో తనకు రావాల్సిన డబ్బులు తనకు ఇవ్వాలని పలుమార్లు అడిగినా, మళ్ళీ పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఈరోజు ఉదయం సదరు నాగేశ్వరరావు కారంపూడి వచ్చి బాకీ ఎందుకు ఇవ్వలేదని గట్టిగా అడిగిన నేపథ్యంలో పెద్ద గొడవ జరగగా అదే సమయంలో లక్ష్మణరావు పై అతని మనవడు పై కత్తితో దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆలూరు లక్ష్మణ రావుకి తీవ్రగాయాలు కాగా మనవడికి స్వల్పగాయాలయ్యాయి. ఈ గొడవ నేపథ్యంలో కత్తితో దాడి చేసి పారిపోతున్న సదరు నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కారంపూడి పోలీసులు తెలిపారు. కాగా దాడి నేపథ్యంలో సదరు నాగేశ్వరరావుకు కూడా గాయాలయ్యాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement