Monday, May 6, 2024

22 న రాకెట్ల నారాయణరెడ్డి క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్

ఉరవకొండ (ప్రభ న్యూస్ ) : పట్టణంలోని ఎస్కె ప్రభుత్వ పాఠశాలలో గత నెలరోజులుగా జరుగుతున్న ప్రముఖ కమ్యూనిస్టు నేత దివంగత రాకెట్ల నారాయణరెడ్డి క్రికెట్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఈ నెల 22 న శుక్రవారం జరగనుందని వైస్సార్సీపీ నాయకులు ప్రెస్ మీట్ లో తెలిపారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్వగృహంలో నాయకులు పట్టణ అధ్యక్షుడు బ్యాంక్ ఓబులేసు, ప్రధాన కార్యదర్శి ఈడీగ ప్రసాద్, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, ఉపాధ్యక్షుడు చంగల మహేష్, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, ఎస్సి సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, పెన్నహోబిలం ఆలయ కమిటీ చైర్మన్ అశోక్ కుమార్, నాయకులు బుక్కీట్ల కృష్ణమూర్తి, మీనుగా ఎర్రిస్వామి, నిమ్మల వెంకట రమణ, టోర్నీ నిర్వాహకులు సింగాడి ధనరాజ్, రాంబాబు తదితరులు మాట్లాడుతూ ఈ టోర్నీలో విన్నర్స్, రన్నర్స్ జట్లకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ పక్కిరప్ప, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, యువనేత ప్రణయ్ రెడ్డి, డిఎస్పీ నరసింగప్ప, సీఐ శేఖర్ హాజరుతారని వారు చెప్పారు. నియోజకవర్గంలోనే అతిపెద్ద టోర్నీగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన జట్టుకు రూ.50 వేలు, రన్నర్స్ జట్టుకు రూ. 25 నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఆఖరు మ్యాచ్ ఉదయం 10:30 కి ప్రారంభమవుతుందని మధ్యాహ్నం ఫ్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వుంటుంద‌ని తెలిపారు. టోర్నీ ముగింపుకు నారాయణ రెడ్డి, అభిమానులు, క్రికెట్ ప్రేమికులు, వైస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement