Thursday, May 2, 2024

AP: విద్యుత్ షాక్ తో.. తండ్రీకొడుకుల మృతి

అనంతపురం, ప్రభ న్యూస్ బ్యూరో : విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకులు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నార్పల మండలం నర్సాపురం గ్రామ సమీపంలో ఉన్న హెచ్ఎల్సి కెనాల్ వద్ద ఇవాళ విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతిచెందారు.

హెచ్ఎల్సీ కాలువలో మోటార్ కు పట్టిన చిలుమును తీసివేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి భయపరెడ్డి, ఆయన కుమారుడు రాజారెడ్డి ఇద్దరు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement